Friday, February 17, 2023

Ayodhya Rama Temple:అయోధ్య రామ మందిరంలోని బాహుబలి గంట.. దీని ప్రత్యేకత తెలుసా?



 Ayodhya Ramalayam: అయోధ్య రామ మందిరంలోని బాహుబలి గంట.. దీని ప్రత్యేకత తెలుసా..


అష్టధాతువుతో చేసిన ఈ గంట రామమందిరంలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. UP లోని జలేసర్ మున్సిపల్ కౌన్సిల్ చైర్మన్ వికాస్ మిట్టల్ ఫ్యాక్టరీలో తయారైన ఈ గంట ఇప్పటికే భారీ క్రేన్ సహాయంతో టుటికోరిన్ నుంచి అయోధ్యకు తరలిస్తోంది.

రామజన్మభూమి అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం కోట్లాది మంది రామభక్తులు ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. సరయూ నది ఒడ్డున రాములోరి మందిర నిర్మాణం చకచకా సాగుతోంది. 

2024 లో ఆలయ నిర్మాణం పూర్తి చేసి భక్తుల దర్శనానికి సిద్ధం కానుంది. రామమందిర నిర్మాణం పూర్తి చేసి భక్తులకు ఆలయ దర్శనం కల్పించేందుకు వీలుగా నిర్మాణాన్ని పర్యవేక్షిస్తున్న ట్రస్టు సభ్యులు తెలిపారు. 

మరోవైపు, రామయ్య ఆలయంలో అమర్చే గంటను ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తయారు చేసింది. 

అష్టధాతువుతో చేసిన ఈ గంట రామమందిరంలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. యూపీలోని జలేసర్ మున్సిపల్ కౌన్సిల్ చైర్మన్ వికాస్ మిట్టల్ ఫ్యాక్టరీలో తయారైన ఈ గంటను భారీ క్రేన్ సహాయంతో ఇప్పటికే టుటికోరిన్ నుంచి అయోధ్యకు తరలించారు.

రామాలయంలో ఏర్పాటు చేయనున్న 2100 కేజీల బరువైన గంట హిందూ ముస్లిం ఘంటా నాదంగా మారి.. ప్రత్యేకంగా నిలుస్తుంది. ఎందుకంటే ఈ గంటను ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా ఇక్బాల్ మిస్త్రీ అనే ముస్లిం ఆర్టిస్ట్ డిజైన్ చేశారు. ఈ గంటను వికాస్ మిట్టల్ ఫ్యాక్టరీలో దావదయాళ్ నేతృత్వంలోని బృందం అష్టధాతువుతో తయారు చేసింది.

2,100 కిలోల బరువున్న ఈ గంట 6' X 5' పొడవు మరియు వెడల్పుతో ఉంటుంది. ఈ గంటను ఒకసారి మోగిస్తే గంట నుంచి వెలువడే శబ్ధం దాదాపు 15 కిలోమీటర్ల దూరం వరకు వినిపిస్తుంది. ఇక్బాల్ మిస్త్రీ, దావదయాళ్ బృందంతో పాటు దాదాపు 25 మంది కష్టపడి 4 నెలల్లో దీన్ని రూపొందించారు. ఈ గంట తయారీకి రూ. 21 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. ప్రస్తుతం, ఈ గంట తరలింపు వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

ఉత్తరప్రదేశ్‌లోని ఎటా జిల్లా దేవాలయాలలో ఉపయోగించే గంటల కళాకారులకు ప్రసిద్ధి చెందింది. ఈ ప్రాంతంలోని హస్తకళాకారులు దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా విదేశాల నుండి కూడా ఆర్డర్‌లను పొందుతారు. జిల్లాలోని జలేసర్‌లో దాదాపు 300 వరకు గుడి గంటల తయారీ కర్మాగారాలు ఉన్నాయి. అయోధ్య రాముని కోసం చేసిన గంట 6 అడుగుల పొడవు మరియు 5 అడుగుల వెడల్పు ఉంటుంది. జలేసర్ మునిసిపల్ కార్పొరేషన్ చైర్మన్ కూడా అయిన మిట్టల్ మాట్లాడుతూ, ఈ గంట భారతదేశంలో ఇప్పటివరకు తయారు చేయబడిన అతిపెద్ద గంట అని అన్నారు. బెల్ కొడితే 1-2 కి.మీ లోపు వినపడుతుందని కూడా అంటారు. అంతేకాదు, అయోధ్యలోని రామమందిరం కోసం 500, 250, 100 కిలోల బరువున్న 10 బెల్స్‌ తయారు చేసేందుకు తమ ఫ్యాక్టరీకి ఆర్డర్లు వచ్చాయని చెప్పారు. 2,100 కిలోల గంటను తయారు చేయడానికి బంగారం, వెండి మరియు ఇత్తడితో సహా ఐదు పదార్థాలను ఉపయోగించారు.


0 comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.

SEARCH THIS SITE

RECENT NEWS

TRENDING POSTS

✺ TEACHERINFO వాట్సాప్ గ్రూప్ లింక్స్ ✺ SCERT TEXT BOOKS CLASS 1 - 10

CETS/NOTIFICATIONS/RESULTS

HEALTH

EDUCATIONAL APPS

PROMOTION GOs/LEAVE RULES

ORDERS & PROCEEDINGS

SERVICE MATTERS

Top