Wednesday, October 26, 2022

RAIN ALERT: అక్టోబర్ 28 రాత్రి నుంచి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు - IMD నివేదిక



 వాతావరణం: అక్టోబర్ 28 రాత్రి నుంచి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. ఇదీ వాతావరణ శాఖ నివేదిక.



ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగింది. ఇప్పుడే ఇలా ఉంటే భవిష్యత్తులో ఏం జరుగుతుందోనని ప్రజలు భయపడుతున్నారు. వాతావరణ శాఖ మరోసారి వర్ష హెచ్చరిక జారీ చేసింది. అక్టోబర్ 28 రాత్రి నుంచి రెండు రాష్ట్రాల్లోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్, అమరావతి కేంద్రాలు తెలిపాయి.శ్రీలంక మధ్య తమిళనాడు మీదుగా అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడైంది. ఈ అల్పపీడనం ద్రోణిగా, ఆ తర్వాత తీవ్ర ద్రోణిగా మారే సూచనలున్నాయి. దీంతో అక్టోబర్ 29 నుంచి వర్షాలు కురిసే అవకాశాలున్నాయి.నైరుతి రుతుపవనాల సీజన్ ముగిసింది. ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో వర్షాలు కురుస్తాయి. అక్టోబర్ 29 నుండి ఆగ్నేయ ద్వీపకల్ప భారతదేశంలో ఈశాన్య రుతుపవనాల వర్షాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

బంగ్లాదేశ్‌లో సిత్రంగ్ కల్లోలం

సిత్రాంగ్ తుపాను సృష్టించిన అల్లకల్లోలానికి బంగ్లాదేశ్ అల్లాడిపోయింది. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ముందస్తు చర్యలు తీసుకున్నప్పటికీ ఈ తుపాను కారణంగా 35 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈదురు గాలులకు చెట్లు కూలడంతో ఎక్కువ మంది చనిపోయారు. తుఫాను టికోనా ద్వీపం వద్ద తీరాన్ని తాకింది. దీని ప్రభావంతో బంగ్లాదేశ్‌లోని 15 జిల్లాల్లో సిత్రంగ్ తీవ్ర విధ్వంసం సృష్టించింది. 10 వేలకు పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయి. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. పలుచోట్ల ఈదురు గాలులకు రేకులతో కూడిన ఇళ్ల పైకప్పులన్నీ కొట్టుకుపోయాయి. వెయ్యికి పైగా రొయ్యల పొలాలు కొట్టుకుపోయాయి. బంగాళాఖాతంలో డ్రెడ్జింగ్ డ్రెడ్జర్ మునిగి 8 మంది మరణించారు.

READమీ ZPPF అప్డేటెడ్ బాలన్స్ షీట్ డౌన్లోడ్  చేసుకోగలరు

మరోవైపు ఈదురు గాలులకు కరెంట్ స్తంభాలు నేలకూలడంతో బంగ్లాదేశ్‌లో పలుచోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. చాలా మంది అంధకారంలో దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు. తుఫాను కేంద్రం నుండి చాలా దూరంలో ఉన్నప్పటికీ, దాని ప్రకంపనలు ఢాకాలో కూడా కనిపించాయి. సోమవారం ఒక్కరోజే ఢాకాలో 32 సెంటీమీటర్ల వర్షం కురిసింది. గత కొన్ని సంవత్సరాలుగా, ప్రతి సంవత్సరం బంగ్లాదేశ్‌ను తుఫానులు ముంచెత్తుతున్నాయి. ఈ శతాబ్దంలో 22 ఏళ్లలో బంగ్లాదేశ్‌ను తాకడం ఇది 11వ తుఫాను. 2015 నుంచి ప్రతి సంవత్సరం బంగ్లాదేశ్‌ను ఏదో ఒక సమయంలో తుపాను వణికిస్తోంది.

READ: DOWNLOAD YOUR PAYSLIP HERE

బంగ్లాదేశ్‌ను తాకిన సిత్రంగ్ తుపాను ప్రభావం భారత్‌లోనూ కనిపించింది. బంగ్లాదేశ్‌కు ఆనుకుని ఉన్న అస్సాం, త్రిపుర, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం రాష్ట్రాలు తుపాను ప్రభావంతో దెబ్బతిన్నాయి. అస్సాంలో 83 గ్రామాలు ముంపునకు గురయ్యాయి. 325 హెక్టార్లలో పంట నష్టం జరిగింది. ఈశాన్య భారతదేశంలో విమానాల రాకపోకలు దెబ్బతిన్నాయి. కొన్ని రైళ్లను కూడా రద్దు చేశారు.

ALSO READ:

1.మీకు APGLI లోన్ ఎంత వస్తుంది... సింపుల్ గా ఇలా తెలుసుకోండి

2.ఉద్యోగుల సెలవులు .. ఏ సెలవు ఏ విధం గా వాడాలి... వివరణ- సంబంధిత ఉత్తర్వులు

3.PAL ప్రోగ్రాం అంటే ఏమిటి? HM /TEACHER చేయవలసినవి ఏమిటి ?


0 comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.

SEARCH THIS SITE

RECENT NEWS

TRENDING POSTS

✺ TEACHERINFO వాట్సాప్ గ్రూప్ లింక్స్ ✺ SCERT TEXT BOOKS CLASS 1 - 10

CETS/NOTIFICATIONS/RESULTS

HEALTH

EDUCATIONAL APPS

PROMOTION GOs/LEAVE RULES

ORDERS & PROCEEDINGS

SERVICE MATTERS

Top