టీచర్ల బదిలీలకు గ్రీన్సిగ్నల్
ఏపీలో టీచర్ల బదిలీలకు రంగం సిద్ధమైంది. టీచర్ల బదిలీలకు జగన్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సీఎం జగన్ ఆదేశాల మేరకు బదిలీలు చేపడతామని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. బదిలీల కోసం ఎవరి చుట్టూ టీచర్లు తిరగక్కర్లేదన్న ఆయన.. వెబ్ కౌన్సిలింగ్ ద్వారా టీచర్ల బదిలీలు ఉంటాయని వెల్లడించారు. ఈ ఏడాది స్కూల్స్ తిరిగి ప్రారంభం అయ్యే లోపు ఈ ప్రక్రియ పూర్తిచేస్తామని పేర్కొన్నారు.
ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న టీచర్ ల అంతర్జిల్లా బదిలీల ఫైల్ కి కూడా ఆమోదం లభించిందని తెలియవచ్చింది
0 comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.